ఇంటర్ విద్యార్ధులకు గుడ్న్యూస్, ఫలితాలపై త్వరలోనే నిర్ణయం: ఏపీ మంత్రి సురేష్
ఏపీలో ఇంటర్ విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఇంటర్ ఫలితాలపై నిర్ణయం తీసుకొంటామని ఏపీ మంత్రి సురేష్ తెలిపారు.
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల ఫలితాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఫలితాల ప్రకటనపై ఇప్పటికే సీఎం జగన్కు ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. అలాగే టెన్త్ పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దవగా, ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.
10వ తరగతి మార్కులు 30 శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు 70 శాతం ప్రాతిపదికగా విద్యార్ధులకు సెకండియర్ మార్కులు కేటాయించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.ఈ సిఫారసుల ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయించారు. ఫలితాల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం నుండి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
